రూ.5 లక్షలకు చేపల చెరువు వేలం

ABN , First Publish Date - 2020-09-30T11:17:54+05:30 IST

పర్చూరు మండలం నా గులపాలెంలోని వెంకటయ్య కుంట లో చేపలు పెంచుకొనేందుకు..

రూ.5 లక్షలకు చేపల చెరువు వేలం

పెరిగిన ధరతో అందరూ ఆశ్చర్యం 


నాగులపాలెం(పర్చూరు), సెప్టెం బరు 29: పర్చూరు మండలం నా గులపాలెంలోని వెంకటయ్య కుంట లో చేపలు పెంచుకొనేందుకు మం గళవారం బహిరంగ వేలం నిర్వ హించారు. మూడు సంవత్సరాల కాలపరిమితిలో చేపలను పెంచుకొ నేందుకు అధికారులు పాట చేప ట్టారు. గతంలో ఎన్నడూ లేని వి ధంగా అనూహ్యంగా ధర పెరిగింది. మల్లా వెంకటేశ్వర్లు రూ.5,04,000లకు వే లంలో పాడి అందరిని అశ్చర్యానికి గురిచేశారు. గతంలో ఇదే చెరువుకు నిర్వ హించిన వేలం పాటలో కేవలం రూ.60 వేలు మాత్రమే పలి కింది. తాజాగా పంచాయతీకి ఆదాయం పెరగటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీఎల్‌ పీవో ఒంగోలు సిబ్బంది, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-30T11:17:54+05:30 IST