మత్స్యాలతో వెళ్లడం.. మద్యంతో రావడం..!
ABN , First Publish Date - 2020-07-13T19:57:54+05:30 IST
చేపల లోడుతో బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి మద్యాన్ని అక్రమంగా..
బెంగళూరు నుంచి అక్రమంగా తరలింపు
నెల్లూరు(ఆంధ్రజ్యోతి): చేపల లోడుతో బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి మద్యాన్ని అక్రమంగా నెల్లూరుకు తరలించి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఎస్ఈబీ పోలీసులు రట్టు చేశారు. కర్ణాటక నుంచి వస్తున్న ఓ వాహనంలో అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఈబీ పోలీసులు శనివారం రాత్రి వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఆ వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో 266 క్వార్టర్ బాటిళ్లు ఉన్నట్లు గుర్తించి, వాహనంలో ఉన్న ధ్రువతేజ, వినయ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ధ్రువతేజ సోదరుడు వసంత్ వెంకటేశ్వరపురంలో ఉంటూ మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.