ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: తొలి రెండు టెస్టులు ప్రేక్షకులు లేకుండానే!

ABN , First Publish Date - 2021-01-23T22:23:07+05:30 IST

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య వచ్చే నెలలో స్వదేశంలో టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, తొలి రెండు టెస్టులు

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: తొలి రెండు టెస్టులు ప్రేక్షకులు లేకుండానే!

న్యూఢిల్లీ: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య వచ్చే నెలలో స్వదేశంలో టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, తొలి రెండు టెస్టులు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ రెండు టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనుంది. బీసీసీఐ ఆదేశాల ప్రకారం ఇక్కడ జరిగే రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించబోమని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) కార్యదర్శి ఆర్ఎస్ రామసామి తెలిపారు. కొవిడ్-19 నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 


కరోనా వైరస్ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిదంబరం స్టేడియంలో జరిగే తొలి రెండు టెస్టులను క్లోజ్‌డ్ డోర్స్ మధ్యే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 27న భారత్, ఇంగ్లండ్ జట్లు చెన్నై చేరుకుంటాయి. బయో బబుల్‌లోకి వెళ్లడానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5న తొలి టెస్టు ప్రారంభం అవుతుంది.

Updated Date - 2021-01-23T22:23:07+05:30 IST