అది దేశంలోనే తొలి గాంధీ విగ్రహం
ABN , First Publish Date - 2022-05-26T10:16:32+05:30 IST
హైదరాబాద్, మే 25(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏ మాత్రం కదిపే ప్రయత్నం చేయొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి
- దాన్ని కదిపే ప్రయత్నం చేయొద్దు: మర్రి శశిధర్రెడ్డి
హైదరాబాద్, మే 25(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏ మాత్రం కదిపే ప్రయత్నం చేయొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి కోరారు. రెండో విగ్రహం పెట్టే ఆలోచనా మానుకోవాలని, విస్తరణ చేసే అవసరమూ లేదని సూచించారు. ఈ మేరకు బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు మర్రి లేఖ రాశారు. ఎంజీ రోడ్డులో ఏర్పాటైన విగ్రహం.. దేశంలోనే మొదటి గాంధీ విగ్రహమన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆ విగ్రహానికి సంబంధించి జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు 20న తాము వెళితే.. కాంగ్రెస్ వాళ్లు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని అనడం మంత్రి తలసాని అవగాహనా లోపమన్నారు.