హైదరాబాద్కు తొలి డ్రా
ABN , First Publish Date - 2020-11-29T10:04:33+05:30 IST
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎ్సఎల్)లో హైదరాబాద్ ఎఫ్సీ జట్టుకు తొలి డ్రా ఎదురైంది. సునీల్ చెత్రీ సారథ్యంలోని బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్ను హైదరాబాద్ 0-0తో ముగించింది.
పనాజి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎ్సఎల్)లో హైదరాబాద్ ఎఫ్సీ జట్టుకు తొలి డ్రా ఎదురైంది. సునీల్ చెత్రీ సారథ్యంలోని బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్ను హైదరాబాద్ 0-0తో ముగించింది. తొలి అర్ధభాగంలో ఇరుజట్లు హోరాహోరీగా పోరాడడంతో గోల్ నమోదు కాలేదు. హైదరాబాద్ జట్టు ప్రత్యర్థి డిఫెన్స్ను ఛేదిస్తూ గోల్స్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 24వ నిమిషంలో హైదరాబాద్కు ఫ్రీకిక్ చాన్స్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆట చివరి దాకా ఇరు జట్ల గోల్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.