అస్సాంలో తొలి కరోనా కేసు
ABN , First Publish Date - 2020-04-01T04:55:30+05:30 IST
భారత్లో కరోనా మహమ్మారి ప్రబలుతోంది. ఇప్పటికే దేశంలో 1200పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దిస్పూర్: భారత్లో కరోనా మహమ్మారి ప్రబలుతోంది. ఇప్పటికే దేశంలో 1200పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 39మంది మరణించారు. మంగళవారం నాడే జార్ఖండ్లో తొలి కరోనా కేసు నమోదయింది. ఇప్పుడు అస్సాంలో కూడా తొలి కరోనా కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి హిమాంత బిస్వా శర్మ వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన ఓ 52ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్గా తేలినట్లు ఆయన చెప్పారు. సదరు వ్యక్తికి సిల్చార్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నామని, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఇది ఈశాన్య భారతదేశంలో రికార్డయిన మూడో కరోనా కేసు. ఇప్పటికే మిజోరాం, మణిపుర్లో కరోనా కేసులు నమోదయ్యాయి.