గుత్తి మండలం కొత్తపేటలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు

ABN , First Publish Date - 2020-07-05T22:25:51+05:30 IST

కరువు జిల్లాలో కరోనా కనికరం లేకుండా విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా ప్రతి రోజూ వందల సంఖ్యలో మహమ్మారిబారిన పడుతున్నారు.

గుత్తి మండలం కొత్తపేటలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు

అనంతపురం: కరువు జిల్లాలో కరోనా కనికరం లేకుండా విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా ప్రతి రోజూ వందల సంఖ్యలో మహమ్మారిబారిన పడుతున్నారు. గుత్తి మండలంలోని కొత్తపేట గ్రామంలో ఓ యువకుడికి తొలి కరోనా పాజిటివ్ నమోదు అయినట్లు  వైద్యులు తెలిపారు. గుత్తి మండలం కొత్తపేటలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదయింది. దీంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు మండలంలో కరోనా లేదని ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు కేసు నమోదుకావడంతో ప్రజల్లో కలవరం మొదలైంది. అదేవిధంగా గుత్తి పట్టణంలో సిండికేట్ బ్యాంకు ఉద్యోగికి కరోనా పాజిటివ్ నమోదయింది. ఉద్యోగిని అనంతపురం పట్టణానికి తరలించారు. 

Updated Date - 2020-07-05T22:25:51+05:30 IST