కర్నూలు జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు: కలెక్టర్
ABN , First Publish Date - 2020-03-29T00:56:51+05:30 IST
ర్నూలు జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైందని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. సంజామల మండలం నొస్సంలో యువకుడికి కరోనా పాజిటివ్గా గుర్తించారు. రాజస్తాన్లో రైల్వే ఉద్యోగిగా యువకుడు పనిచేస్తున్నాడు.
కర్నూలు: కర్నూలు జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైందని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. సంజామల మండలం నొస్సంలో యువకుడికి కరోనా పాజిటివ్గా గుర్తించారు. రాజస్తాన్లో రైల్వే ఉద్యోగిగా యువకుడు పనిచేస్తున్నాడు. పాజిటివ్ వచ్చిన యువకుడితో 18 మంది కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. ఈ 18 మందిని బనగానపల్లె క్వారంటైన్ సెంటర్కు అధికారులు తరలించారు. నొస్సం గ్రామాన్ని 4 సెక్టార్లుగా విభజించి మెడికల్ స్క్రీనింగ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సామాజిక దూరం పాటించాలని, ఇళ్ల నుంచి బయటికి రావద్దని కలెక్టర్ సూచిస్తున్నారు.