శంషాబాద్‌ మున్సిపాలిటీలో తొలి కరోనా కేసు

ABN , First Publish Date - 2020-06-02T09:13:34+05:30 IST

శంషాబాద్‌ మున్సిపాలిటీలో సోమవారం తొలి కరోనా కేసు నమోదైంది. శంషాబాద్‌కు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.

శంషాబాద్‌ మున్సిపాలిటీలో తొలి కరోనా కేసు

శంషాబాద్‌: శంషాబాద్‌ మున్సిపాలిటీలో సోమవారం తొలి కరోనా కేసు  నమోదైంది. శంషాబాద్‌కు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. గత ఆరు రోజుల క్రితం శంషాబాద్‌కు వచ్చాడు. అతను పనిచేసే ఆసుపత్రిలోనే జియాగూడబస్తీకి చెందిన ఓ నర్సుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వైద్యులు ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతన్ని కోవిద్‌ ఆసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యును హోం క్వారంటైన్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. శంషాబాద్‌లో తొలికరోనా కేసురావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-06-02T09:13:34+05:30 IST