ఫారెస్ట్‌లో చెలరేగిన మంటలు

ABN , First Publish Date - 2022-05-22T05:29:13+05:30 IST

మండల పరిధిలోని శాంతిగూడెం సమీపంలోని ఫారెస్ట్‌ లో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టడంతో

ఫారెస్ట్‌లో చెలరేగిన మంటలు
ఫారెస్ట్‌లో చెలరేగుతున్న మంటలు

- చల్లార్చిన అగ్నిమాపక  సిబ్బంది

 చారకొండ, మే 21: మండల పరిధిలోని శాంతిగూడెం సమీపంలోని ఫారెస్ట్‌ లో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టడంతో దాదాపు 25 ఎకరాల్లో ఉన్న ఎండు గడ్డి పూర్తి దగ్ధమైనట్లు డిప్యూటీ రేంజ్‌ అధికారి రేణుక తెలిపారు. ఫారెస్ట్‌లో నిప్పులు అంటుకున్నాయని శాంతిగూడెం గ్రామస్థులు సమాచారం ఇ వ్వడంతో అగ్నిమాపక కేంద్రానికి తెలియజేశామని, దీంతో సిబ్బంది వచ్చి మం టలను ఆర్పినట్లు ఆమె వివరించారు. ఆమె వెంట ఎస్సై శ్రీనివాస్‌, ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు కిరణ్‌, నిఖిత, లలిత, షఫీ ఉన్నారు.

Updated Date - 2022-05-22T05:29:13+05:30 IST