Chennai: వేర్వేరు ఘటనల్లో 9 మంది గల్లంతు
ABN , First Publish Date - 2021-11-15T17:26:12+05:30 IST
రాణిపేట, కడలూరు జిల్లాల్లో వరద ప్రవాహాల్లో చిక్కుకొని, గల్లంతైన 10 మందిలో ఏడుగురిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించి, మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. రాణిపేట జిల్లా ఓచ్చేరి సమీపం మామండూర్ గ్రామ సమీపంలోని పాలారు
ఆరుగురిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
చెన్నై/పెరంబూర్: రాణిపేట, కడలూరు జిల్లాల్లో వరద ప్రవాహాల్లో చిక్కుకొని, గల్లంతైన 10 మందిలో ఏడుగురిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించి, మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. రాణిపేట జిల్లా ఓచ్చేరి సమీపం మామండూర్ గ్రామ సమీపంలోని పాలారు నది సమీపంలో ఆదివారం ఉదయం అముదన్ (18), నందకుమార్ (18), చిన్నరసు (18), రమేష్ (20), గోకుల్ (20), నాథన్ (20)లు ఆడుకొనేందుకు వెళ్లారు. ఆ సమయంలో హఠాత్తుగా నదిలో వరద ఉధృతం కావడంతో వీరు నది మధ్యలోని ఓ ఎత్తైన ప్రాంతంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకొని పడవల ద్వారా వారిని సురక్షితంగా రక్షించారు. అదే విధంగా, కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని తెన్పెన్నై నది వద్దకు వెళ్లిన ముగ్గురు వరద ఉధృతిలో గల్లంతయ్యారు. గల్లంతైన మాధవన్, మాళవిక, లోకేష్ల ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.