ఆంజనేయ ఫైర్ వర్క్స్ అధినేత పెద్దిరెడ్డి సూరిబాబు మృతి
ABN , First Publish Date - 2021-01-27T06:28:06+05:30 IST
బాణసంచా తయారీలో రాష్ట్ర ఖ్యాతి నార్జించిన ఆంజనేయ ఫైర్వర్క్సు యజమాని పెద్దిరెడ్డి సూరిబాబు(63) గుండెపోటుతో సోమవారం రాత్రి ద్రాక్షారామలో మృతిచెందారు.
ద్రాక్షారామ, జనవరి 26: బాణసంచా తయారీలో రాష్ట్ర ఖ్యాతి నార్జించిన ఆంజనేయ ఫైర్వర్క్సు యజమాని పెద్దిరెడ్డి సూరిబాబు(63) గుండెపోటుతో సోమవారం రాత్రి ద్రాక్షారామలో మృతిచెందారు. సూరిబాబు మృతదేహాన్ని మంగళవారం మాజీ ఎమ్మెల్యే, తోట త్రిమూర్తులు, మాజీ ఏఎంసీ చైర్మన్ దామిశెట్టి గంగా పురుషోత్తం, డాక్టర్ చెలికాని స్టాలిన్, నరాల ఏడుకొండలు, కోటిపల్లి అబ్బు, అయినవిల్లి సతీష్, నంగి బుజ్జి, కృష్ణదాస్, నాగిరెడ్డి సతీష్ సందర్శించి నివాళులర్పించారు. వెలంపాలెం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.