శంషాబాద్లో అగ్నిప్రమాదం.. భయందోళనలో స్థానికులు
ABN , First Publish Date - 2021-03-04T20:08:09+05:30 IST
రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శివారులోని నిర్మాణుష్య ప్రాంతంలో ప్రాణాంతక కెమికల్ను పారబోసి దుండగులు నిప్పంటించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళన చెందారు. ఇలాంటి ఘటనలు అంతకుముందుకూడా జరిగాయని స్థానికులు చెబుతున్నారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.