నిప్పంటుకుని.. కుమార్తె సహా తల్లి మృతి!

ABN , First Publish Date - 2021-03-05T08:49:03+05:30 IST

ఓ చిన్న అజాగ్రత్త తల్లీకూతుళ్లను బలి తీసుకుంది. వంట చేస్తున్న తల్లి ఏమరుపాటుగా ఉండడంతో..

నిప్పంటుకుని.. కుమార్తె సహా తల్లి మృతి!

మెదక్‌ అర్బన్‌, మార్చి 4: ఓ చిన్న అజాగ్రత్త తల్లీకూతుళ్లను బలి తీసుకుంది. వంట చేస్తున్న తల్లి ఏమరుపాటుగా ఉండడంతో.. చీర కొంగుకు నిప్పంటుకుంది. భయపడిపోయిన మూడేళ్ల చిన్నారి.. అమ్మను గట్టిగా కౌగిలించుకుంది. ఇంతలో మంటలు పెద్దవై చిన్నారి సహా తల్లి సజీవ దహనమైపోయింది. ఈ విషాద ఘటన మెదక్‌లోని అజంపూరలో జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న గట్టయ్య గురువారం విధులకు వెళ్లగా.. ఆయన భార్య రేవతి (28) వంట చేస్తూ ఈ ప్రమాదానికి గురైంది. ఆమెతోపాటు కూతురు ఆద్యశ్రీ (3) కూడా అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-03-05T08:49:03+05:30 IST