బాసర ట్రిపుల్‌ ఐటీలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2020-06-01T09:33:38+05:30 IST

బాసరలోని ఆర్జీయూకేటీ, ట్రిపుల్‌ ఐటీలో మళ్లి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో మొదటి అకాడమిక్‌

బాసర ట్రిపుల్‌ ఐటీలో అగ్ని ప్రమాదం

రూ. 20లక్షల ఫర్నిచర్‌ దగ్ధం.. కాలిబూడిదైన వస్తు, సామగ్రి 

గడిచిన 20 రోజుల్లో ఇది మూడో అగ్ని ప్రమాదం


బాసర, మే 31 : బాసరలోని ఆర్జీయూకేటీ, ట్రిపుల్‌ ఐటీలో మళ్లి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో మొదటి అకాడమిక్‌ బ్లాక్‌లో షార్ట్‌సర్య్కూట్‌తో మంటలు ఏర్పడ్డాయి. తరగతి గదిలో ఫర్నిచర్‌ ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. వెంటనే గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఫైర్‌ఇంజన్‌నీ పిలిపించడంతో పెనుప్రమాదం తప్పింది. భైంసా నుండి వచ్చిన రెండు ఫైర్‌ఇంజన్‌లో గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు కూర్చునే కూర్చీలు, బల్లలు, ప్రొజెక్టర్‌, ఇంటర్నెట్‌ వయర్‌లు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. 20 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం ఏర్పడినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. గడిచిన 20 రోజుల్లో ట్రిపుల్‌ ఐటీలో అగ్ని ప్రమాదం సంభించడం మూడు సార్లు చోటు చేసుకుంది.  

Updated Date - 2020-06-01T09:33:38+05:30 IST