కొవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిమాపక తనిఖీలు
ABN , First Publish Date - 2021-05-06T05:31:48+05:30 IST
నగరంలోని పలు కొవిడ్-19 ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులను అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు తనిఖీలు చేశారు.
గుంటూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పలు కొవిడ్-19 ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులను అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు తనిఖీలు చేశారు. బుధవారం పలు ఆస్పత్రులకు వెళ్లిన అధికారులు అక్కడ అగ్నిమాపక శాఖ పరికరాలు సక్రమంగా పని చేస్తోన్నాయో, లేదో పరీక్షించి చూశారు. చాలా ఆస్పత్రుల్లో అగ్నిమాపక పరికరాలు అయితే ఏర్పాటు చేశారే తప్పా వాటిని నిత్యం రన్నింగ్ చేయకపోతుండటంతో అవి స్తంభించిపోయి ఉన్నాయి. బుధవారం పరీక్షించినప్పుడు అవి తొలుత మొరాయించాయి. ఆ తర్వాత పని చేయడం ప్రారంభించాయి. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ నిత్యం ఫైర్ ఎక్విప్మెంట్స్ని రన్నింగ్ చేయాలని ఆదేశించారు.