ఆనంద్ డెయిరీ ప్లాంటులో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-04-27T12:27:56+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ పట్టణంలోని ఆనంద్ డెయిరీ ప్లాంటులో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది...

ఆనంద్ డెయిరీ ప్లాంటులో అగ్నిప్రమాదం

బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ పట్టణంలోని ఆనంద్ డెయిరీ ప్లాంటులో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సియానా ఏరియాలోని ఆనంద్ డెయిరీ ప్లాంటులో మంటలు చెలరేగడంతో అధికారులు హుటాహుటిన అగ్నిమాపక వాహనాలను రప్పించారు.డెయిరీ ప్లాంటులో ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపకశాఖ, పోలీసు, జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. అగ్నిప్రమాదం జరిగినపుడు డెయిరీ ప్లాంటులో ఎంతమంది కార్మికులున్నారనేంది ఇంకా తేలలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2022-04-27T12:27:56+05:30 IST