HYD : ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం.. ఉక్కిరిబిక్కిరైన రోగులు
ABN , First Publish Date - 2022-02-01T12:16:05+05:30 IST
దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్కు సమాచారమందించారు.
- భారీగా కమ్ముకున్న పొగలు
- వేరే ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్ సిటీ/హైదర్నగర్ : కేపీహెచ్బీ నిజాంపేట రోడ్డులోని శ్రీశ్రీ హోలీస్టిక్ ఆస్పత్రి మొదటి అంతస్తులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్కు సమాచారమందించారు. నాలుగు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ప్రమాదం జరిగిన అంతస్తులో దాదాపు 30 మంది రోగులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఐసీయూ వార్డులోని బాధితులను సెక్యూరిటీ గార్డులు భుజాలపై వేసుకుని బయటికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులతోపాటు, వైద్య సిబ్బంది హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది. ఆస్పత్రిలోని రోగులను హుటాహుటిన అంబులెన్స్లో వేరే ఆస్పత్రులకు తరలించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తదితరులు ఆస్పత్రిని సందర్శించారు.