ఈద్గా వద్ద అగ్ని ప్రమాదం.. తప్పిన ముప్పు

ABN , First Publish Date - 2022-08-20T05:46:17+05:30 IST

ఈద్గా వద్ద అగ్ని ప్రమాదం.. తప్పిన ముప్పు

ఈద్గా వద్ద అగ్ని ప్రమాదం.. తప్పిన ముప్పు

తాండూరు : చెనిగేష్‌పూర్‌ రోడ్డు మార్గంలోని ఈద్గాలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈద్గా మైదానంలోని ఓ గదిలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని గదిలో ఉన్న సామగ్రి దగ్ధమైంది. అగ్నిమాపక కేంద్రం అధికారులు మంటలను ఆర్పేశారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న ఈద్గాను వేర్వేరుగా పరిశీలించారు. ఈద్గాలో అగ్ని ప్రమాదంపై ఆర్డీవో, తహసీల్దార్‌తో మాట్లాడి నష్టపరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వేర్వేరుగా ఈద్గా కమిటీ చైర్మన్‌కు తెలిపారు. ఈద్గా కమిటీ సభ్యులు విద్యుత్‌, రెవెన్యూ, పోలీసులకు జరిగిన సంఘటను తెలుపగా,  తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు, కరన్‌కోట్‌ ఎస్‌ఐ మధు సూదనరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జరిగిన ప్ర మాదంపై ముస్లింవెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిఽధులు పరిశీలించారు.

Updated Date - 2022-08-20T05:46:17+05:30 IST