Krishna: రుచి పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం..
ABN , First Publish Date - 2021-08-05T13:21:39+05:30 IST
జిల్లాలోని బాపులపాడు మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. అంపాపురం జాతీయ రహదారి సమీపంలో ఉన్న రుచి పామాయిల్
కృష్ణా: జిల్లాలోని బాపులపాడు మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. అంపాపురం జాతీయ రహదారి సమీపంలో ఉన్న రుచి పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రొక్లెయిన్, ట్రాక్టర్ పూర్తిగా మంటల్లో దగ్ధం అయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.