దిరశంవాని దళితవాడలో మూడిళ్లు దగ్ధం
ABN , First Publish Date - 2020-12-03T06:38:38+05:30 IST
ఘంటసాల దిరిశంవాని దళితవాడలో బుధవారం అగ్నిప్రమాదంలో రెండిళ్లు పూర్తిగా, ఒక గృహం పాక్షికంగా దగ్ధమైంది.
ఘంటసాల, డిసెంబరు 2 : ఘంటసాల దిరిశంవాని దళితవాడలో బుధవారం అగ్నిప్రమాదంలో రెండిళ్లు పూర్తిగా, ఒక గృహం పాక్షికంగా దగ్ధమైంది. రూ.4లక్షల మేర ఆస్థి నష్టం జరిగింది. తొలుత గరికిపూడి రామారావు ఇంట్లో మంటలు రేగి ఇంటిలో ఉన్న సామాగ్రితోపాటు గ్యాస్ సిలెండర్ పేలిపోయింది. నిప్పురవ్వలు సమీపంలోని నడకుదురు శుభశేఖర్ ఇంటిపై పడటంతో ఆ ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది. మంటలు వ్యాపించి కొడాలి నిరీక్షణ రావు ఇంటి అంటుకోగా గ్రామస్థులు అదుపులోకి తెచ్చారు. ఐదెకరాల గడ్డివామి పూర్తిగా దగ్ధమైంది. సామాగ్రి, నగదు, ఆభరణాలు పూర్తిగా దగ్ధం కావటంతో రామారావు, శుభశేఖర్ కుటుంబాలు కట్టుబట్టలతో నిరాశ్ర యులుగా నిలిచారు. మొవ్వ అగ్నిమాపక అధికారి రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎంపీడీవో కె.వి.సుబ్బారావు, ఆర్ఐ సుధాకర్, వీఆర్వో రాఘవులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.