గాలిలో కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు... కేసు నమోదు!

ABN , First Publish Date - 2021-07-17T16:40:34+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే..

గాలిలో కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు... కేసు నమోదు!

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జర్ కుమారుడు నరేష్ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపిన నేపధ్యంలో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసుల అధికారి మాట్లాడుతూ లోనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గనోలీ గ్రామంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నదన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటవీశాఖ అధికారి అందించిన తుపాకీతో నరేష్ గాలిలోకి కాల్పులు జరపాడన్నారు. కాగా ఈ ఉదంతంపై ఎమ్మెల్యే నంద కిషోర్ మాట్లాడుతూ తానంటే గిట్టనివారెవరో తన కుమారునిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన కుమారుడు వాడినది టాయ్ గన్ అని తెలిపారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-17T16:40:34+05:30 IST