పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళా ఏఎస్ఐపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-06-15T12:25:38+05:30 IST

పెళ్లి చేసుకుంటానని చెప్పి సాక్షాత్తూ మహిళా అసిస్టెంట్ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరుపై అత్యాచారం జరిపిన యువకుడి బాగోతం...

పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళా ఏఎస్ఐపై అత్యాచారం

ముంబై (మహారాష్ట్ర): పెళ్లి చేసుకుంటానని చెప్పి సాక్షాత్తూ మహిళా అసిస్టెంట్ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరుపై అత్యాచారం జరిపిన యువకుడి బాగోతం మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. ఔరంగాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడికి ముంబైలోని మహిళా ఏఎస్ఐతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ప్రధాన నిందితుడైన యువకుడు ముంబై నగరంలోని పోవాయ్ కు వచ్చి మహిళా ఏఎస్ఐను కలిసి పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. 


మహిళా ఏఎస్ఐతో కలిసి ఉన్న  వీడియో తీసి దాన్ని బయటపెడతానని బెదిరించి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలైన మహిళా ఏఎస్ఐ ఫిర్యాదులో ముంబై పోలీసులు 11 ఐపీసీ సెక్షన్లతో సహా ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముంబైలోని పోవాయి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2021-06-15T12:25:38+05:30 IST