రెండు రోజుల్లో ఖాతాలోకి జరిమానా నిధులు

ABN , First Publish Date - 2020-05-21T08:57:01+05:30 IST

దుకాణదారులకు విధించిన జరిమానా డబ్బులను రెం డు రోజుల్లో మున్సిపల్‌ జనరల్‌ నిధుల్లోకి జమ చేస్తామని కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు

రెండు రోజుల్లో  ఖాతాలోకి జరిమానా నిధులు

తాండూరు : దుకాణదారులకు విధించిన జరిమానా డబ్బులను రెం డు రోజుల్లో మున్సిపల్‌ జనరల్‌ నిధుల్లోకి జమ చేస్తామని కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు పాటించని దుకాణదారులకు విధించిన జరిమానాల విషయమై బుధవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘జమ కాని జరిమాన నిధులు’ వార్తకు కమిషనర్‌ స్పందించారు. నిధులు మున్సిపల్‌  సిబ్బంది వద్ద ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో సీజ్‌ చేసిన వస్తువులను బయట విక్రయించినట్లు ప్రచారం నిజం కాదని వివరించారు. సిబ్బందిపై వస్తున్న వివిధ ఆరోపణలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. 

Updated Date - 2020-05-21T08:57:01+05:30 IST