గుట్కా విక్రేతలకు రూ.37వేల జరిమానా
ABN , First Publish Date - 2020-12-06T04:17:45+05:30 IST
జాయింట్ కలెక్టర్ హరేందిరప్రసాద్ తన కోర్టుద్వారా గుట్కా, కైనీ అమ్మిన వారికి రూ.37వేల జరిమానా విధించారు. ఫుడ్సేఫ్టీ అధికారులు పెట్టిన 25కేసుల్లో 15 కేసులను జేసీ పరిష్కరించారు.
నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 5 : జాయింట్ కలెక్టర్ హరేందిరప్రసాద్ తన కోర్టుద్వారా గుట్కా, కైనీ అమ్మిన వారికి రూ.37వేల జరిమానా విధించారు. ఫుడ్సేఫ్టీ అధికారులు పెట్టిన 25కేసుల్లో 15 కేసులను జేసీ పరిష్కరించారు. జరిమానా విధించిన వారు మళ్లీ గుట్కా, కైనీ అమ్ముతూ పట్టుబడితే జైలు శిక్ష విధిస్తామని జేసీ హెచ్చరించారు. ఏఎఫ్సీ ఎస్.శ్రీనివాస్, ఎఫ్ఎస్వోలు ఎస్. రామచంద్ర, చంద్రశేఖర్, కే. నర్మద, డీ.నిరజ తదితరులు పాల్గొన్నారు.