నా భర్త మృతికి కారణాలు తేల్చండి
ABN , First Publish Date - 2021-01-14T06:23:30+05:30 IST
ఆర్మీ అధికారిగా పనిచేస్తున్న భర్త సంజీవరెడ్డి మృతికి కారణాలు తేల్చాలని చిత్తూరుకు చెందిన సరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు
చిత్తూరు, జనవరి 13: తన భర్త మృతికి గల కారణాలను తేల్చాలంటూ చిత్తూరుకు చెందిన ఓ ఆర్మీ అధికారి భార్య టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ యుగంధర్ కథనం మేరకు.. చిత్తూరు నగరం జానకారపల్లెకు చెందిన సంజీవరెడ్డి(43) తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నారు. కాగా, గతనెల 22వతేది ఆయన సెలవుపై చిత్తూరు వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం సంజీవరెడ్డికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు స్థానిక జిల్లా వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన మృతిచెందినట్లు పేర్కొన్నారు. దీంతో తన భర్త మృతికి గల కారణాలు తేల్చాలంటూ ఆర్మీ అధికారి భార్య సరిత టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ పేర్కొన్నారు.