ఫించన్దారులు 31లోగా లైఫ్సర్టిఫికెట్ ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-10-23T10:22:48+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పింఛన్దారుల్లో లైఫ్ సర్టిఫికెట్ గతంలో సమర్పించని వారు ఈనెల 31వ తేదీలోగా సీతమ్మధారలోని సబ్ట్రెజరీ..
సీతమ్మధార, అక్టోబరు 22:రాష్ట్ర ప్రభుత్వం పింఛన్దారుల్లో లైఫ్ సర్టిఫికెట్ గతంలో సమర్పించని వారు ఈనెల 31వ తేదీలోగా సీతమ్మధారలోని సబ్ట్రెజరీ కార్యాలయంలో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారుల సంఘం అధ్యక్షుడు డి.డి.ప్రసాదరావు తెలిపారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో లైఫ్ సర్టిఫికెట్స్ అందజేయాల్సి ఉన్నా కరోనా కారణంగా కొంతమంది అందజేయలేకపోయారన్నారు. అటువంటి వారు ఈనెలాఖరులోగా ధ్రువపత్రం సమర్పించాలన్నారు. లేనిపక్షంలో పింఛన్ అందుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అందువల్ల తక్షణం ఆన్లైన్ లేదా నేరుగా సర్టిఫికెట్లు కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఇప్పటికే ఈ ఏడాది సర్టిఫికెట్లు ఇచ్చిన వారు మళ్లీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.