మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం

ABN , First Publish Date - 2021-05-11T05:39:50+05:30 IST

మామిళ్లపల్లె క్వారీ పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరికి ఆర్థిక సాయం అందించారు.

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
పోరుమామిళ్లలో కొరివి ప్రసాద్‌ కుటుంబ సభ్యులకు రూ.5లక్షలు నగదు అందిస్తున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

పోరుమామిళ్ల, మే 10: మామిళ్లపల్లె క్వారీ పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరికి ఆర్థిక సాయం అందించారు. పోరుమామిళ్లలోని శ్రీరామ్‌నగర్‌కాలనీకి చెందిన కొరివి ప్రసాద్‌ కుటుంబీకులకు క్వారీ నిర్వాహకుల ద్వారా రూ.5లక్షలు, కలసపాడు మండలం గంగాయపల్లెకు చెందిన బత్తుల ప్రసాద్‌ కుటుంబానికి మరో రూ.5లక్షల నగదును ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అందించారు. సోమవారం పోరుమామిళ్లలోని ఆయన స్వగృహంలో ఈ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా మరో పదిలక్షలు మృతుల కుటుంబాలకు అందనున్నాయని, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి దృష్టికి సమస్య తీసుకెళ్లి అదనంగా నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. బద్వేలు మార్కెట్‌యార్డు వైస్‌ చైర్మన్‌ రమణారెడ్డి, రంగసముద్రం సర్పంచ్‌ చిత్తా రవిప్రకాశ్‌రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ సీఎం బాషా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T05:39:50+05:30 IST