ఆర్పీఎఫ్ జవాను కుటుంబానికి ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2021-01-27T06:15:29+05:30 IST
ఇటీవల రోడ్డు ప్రమాదంలో బాటజంగాలపాలేనికి చెందిన ఆర్పీఎఫ్ జవాను గొర్లి శంకర్ మృతి చెందగా అతని కుటుంబ సభ్యులను అసిస్టెంట్ కమాండర్ ఆరిఫ్ మంగళవారం పరామర్శించారు.
సబ్బవరం, జనవరి 26 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో బాటజంగాలపాలేనికి చెందిన ఆర్పీఎఫ్ జవాను గొర్లి శంకర్ మృతి చెందగా అతని కుటుంబ సభ్యులను అసిస్టెంట్ కమాండర్ ఆరిఫ్ మంగళవారం పరామర్శించారు. 168బీఎన్ ఆర్పీఎఫ్ జవాన్లు సమకూర్చిన రూ.3.15 లక్షల ఆర్థిక సహాయాన్ని శంకర్ కుటుంబ సభ్యులకు ఆమె అందజేశారు. శంకర్కు ప్రభుత్వపరంగా రావలసిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అంతకు ముందు తోటి జవాన్లతో కలిసి శంకర్ భౌతికకాయం పూడ్చిన శ్మశాన వాటిక వద్దకు వెళ్లి పుష్పగుచ్ఛం ఉంచి ఆమె నివాళులర్పించారు.