బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం
ABN , First Publish Date - 2022-10-05T04:39:23+05:30 IST
బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం
యాచారం/ షాద్నగర్ అర్బన్, అక్టోబర్ 4: గొల్లగూడలోని ఎర్రకుంటలో పడి నలుగురు పిల్లలు మృతిచెందగా బాధిత కుటుంబాలను మంగళవారం బీఎన్రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్రెడ్డి పరామర్శించారు. రూ.25వేల చొప్పున రూ.లక్ష అందజేశారు. కార్యక్రమంలో మండల రైతుసమన్వయ సమితి చైర్మన్ కె.జోగిరెడ్డి, సర్పంచ్ డి.రమేష్ తదితరులున్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకుడు అందె బాబయ్య బీజేపీ షాద్నగర్ ఇన్చార్జి నెల్లి శ్రీవర్దన్రెడ్డితో కలిసి బాధితులను పరామర్శించారు. రూ.6వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు.