రాజ్యసభ ముందుకు ఆర్థిక సర్వే

ABN , First Publish Date - 2022-01-31T20:38:36+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2021-22 ఆర్థిక సర్వేను ..

రాజ్యసభ ముందుకు ఆర్థిక సర్వే

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2021-22 ఆర్థిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనికి ముందు లోక్‌సభకు కూడా ఆర్థిక సర్వేను మంత్రి సమర్పించారు. అనంతరం లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడగా, ఆ వెనువెంటనే రాజ్యసభలోనూ ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అది పూర్తికాగానే రాజ్యసభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల తొలి రెండో రోజులు ప్రశ్నోత్తరాల సమమయం, జీరో అవర్ ఉండవు. బడ్జెట్ సమావేశాల్లో అత్యధిక సమయం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపై తీర్మానంపైన, బడ్జెట్ ప్రతిపాదనలపైన చర్చకే సరిపోతుంది.

Updated Date - 2022-01-31T20:38:36+05:30 IST