ఫైనల్లో నిఖత్ జరీన్
ABN , First Publish Date - 2021-10-27T07:38:41+05:30 IST
మహిళల జాతీయ బాక్సింగ్ చాంపియన్షి్ప 52 కిలోల కేటగిరీలో తెలుగమ్మాయి నిఖత్ జరీన్ ఫైనల్కు దూసుకెళ్లింది. హరియాణాలోని ....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): మహిళల జాతీయ బాక్సింగ్ చాంపియన్షి్ప 52 కిలోల కేటగిరీలో తెలుగమ్మాయి నిఖత్ జరీన్ ఫైనల్కు దూసుకెళ్లింది. హరియాణాలోని హిస్సార్లో జరుగుతున్న ఈ టోర్నీలో నిఖత్ సెమీ్సలో 5-0తో ప్రత్యర్థి రిషి శర్మ (ఉత్తరప్రదేశ్)ను చిత్తు చేసింది. ఇక, 63 కిలోల విభాగంలో హైదరాబాదీ నిహారిక సెమీ్సలో 1-4తో జ్యోతి (రైల్వేస్) చేతిలో ఓటమిపాలై కాంస్య పతకంతో సరిపెట్టుకొంది.