ఓటర్ల తుది జాబితా విడుదల

ABN , First Publish Date - 2021-05-11T05:08:45+05:30 IST

ఆమదాలవలస పురపాలక సంఘం 27 వార్డుల ఓటర్ల తుది జాబితాను కమిషనర్‌ రవిసుధాకర్‌ ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు.

ఓటర్ల తుది జాబితా విడుదల
ఆమదాలవలస : ఓటర్ల తుది జాబితాను నోటీసు బోర్డులో వేలాడదీస్తున్న అధికారులు

ఆమదాలవలస : ఆమదాలవలస పురపాలక సంఘం 27 వార్డుల ఓటర్ల తుది జాబితాను కమిషనర్‌ రవిసుధాకర్‌ ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. వార్డుల్లో  కులాల వారీగా ఓటర్లను సేకరించి ఈనెల మూడో తేదీన ముసాయిదా విడుదల చేశారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి సవరణ తర్వాత తుదిజాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలను  అన్ని ప్రభుత్వకార్యాలయాలు, సచివాలయల నోటీసుబోర్డుల్లో ప్రజల పరిశీలనకోసం ఉంచినట్లు కమిషనర్‌ తెలిపారు. మొత్తం ఓటర్లు 33,738 కాగా బీసీ మహిళలు 14,679, పురుషులు 14,258,ఎస్సీ మహిళలు 1,124, పురుషులు 1,045 ఓటర్లను గుర్తించారు. ఎస్టీ మహిళలు 76, పురుషులు 73 మందిని, ఓసీ మహిళలు 1,254, పురుషులు 1,217, ఇతరులు 12 మందిగా గుర్తించి నట్లు  కమిషనర్‌ తెలిపారు. ఫ రాజాం : రాజాం మునిసిపాలిటీలో ఓటర్ల తుది జాబితా ప్రకటించినట్లు కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ తెలిపారు. గతంలో 20 వార్డులు ఉం డగా, 24 వార్డులుగా పునర్విభజన చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని గుంటూరులోని మునిసిపల్‌ పరిపాలనా విభాగం సోమవారం ఆమోదించిందని చెప్పారు. ఈ మేర కు  ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలను మునిసిపల్‌, తహసీల్దార్‌ కార్యాలయాలతో పాటు పాలకొండ ఆర్డీవో కార్యాలయంలో అందుబాటులో ఉంచామని తెలిపారు.


Updated Date - 2021-05-11T05:08:45+05:30 IST