‘విజయవాడ, విశాఖలో చిత్రపరిశ్రమ’

ABN , First Publish Date - 2020-11-30T09:36:16+05:30 IST

విజయవాడ, విశాఖ కేంద్రాల్లో చిత్రపరిశ్రమ అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలని ఏపీ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ డిమాండ్‌ చేసింది.

‘విజయవాడ, విశాఖలో చిత్రపరిశ్రమ’

విజయవాడ, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): విజయవాడ, విశాఖ కేంద్రాల్లో చిత్రపరిశ్రమ అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలని ఏపీ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ డిమాండ్‌ చేసింది. చాంబర్‌ సర్వసభ్య సమావేశం ఆదివారం విజయవాడలో నిర్వహించారు. అధ్యక్షుడు అంబటి మధుమోహన్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి జేవీ మోహన్‌గౌడ్‌, సంయుక్త కార్యదర్శి ఎం.శ్రీనాథరావు తదితరులు మాట్లాడారు. తెలుగు చిత్రపరిశ్రమకు అధికాదాయం(60ు) ఇస్తున్న ఏపీకి సంబంధించి.. తిరుపతి, విజయవాడ, విశాఖ కేంద్రాల్లో అవుట్‌డోర్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. 


Updated Date - 2020-11-30T09:36:16+05:30 IST