టీఆర్ఎ్సలో భగ్గుమన్న ఆధిపత్య పోరు
ABN , First Publish Date - 2022-05-24T06:30:17+05:30 IST
టీఆర్ఎ్సలో ఆధిపత్య పోరు భగ్గుమంది. మండలంలో అనేక గ్రామాల్లో వర్గపోరు కొనసాగుతుండగా, సోమవారం కొమరబండ గ్రామంలో
ఎమ్మెల్యే సమక్షంలో నెట్టుకున్న నాయకులు
కోదాడ రూరల్, మే 23: టీఆర్ఎ్సలో ఆధిపత్య పోరు భగ్గుమంది. మండలంలో అనేక గ్రామాల్లో వర్గపోరు కొనసాగుతుండగా, సోమవారం కొమరబండ గ్రామంలో ఎమ్మెల్యే ఎదుటనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఉదయం ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ కొమరబండ గ్రామంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభించేందుకు రాగా, ఆ సమయంలో గ్రామానికి చెందిన కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ సంపెట ఉపేందర్గౌడ్ను వేదిక మీదకి ఆహ్వానించలేదని ఆయన వర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమాన్ని మునిసిపల్ కౌన్సిలర్ మామిడి పద్మావతి కుమారుడు రామారావు నిర్వహించారు. రామారావు కావాలనే ఉపేందర్గౌడ్ను వేదిక మీదకి ఆహ్వానించలేదని ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ఘర్షణపడి ఒకరినొకరు నెట్టుకుంటూ దూషించుకున్నారు. ఈ విషయమై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే అర్ధాంతరంగా సభ ముగించి, ఇరువర్గాలు సమన్వయంతో పనిచేయాలని సూచించి వెళ్లిపోయారు.