ఎలాంటి జంకూ లేకుండా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడదాం : రాహుల్

ABN , First Publish Date - 2020-08-08T22:03:51+05:30 IST

ఎలాంటి భయం, జంకూ లేకుండా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

ఎలాంటి జంకూ లేకుండా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడదాం : రాహుల్

న్యూఢిల్లీ : ఎలాంటి భయం, జంకూ లేకుండా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ‘క్విట్ ఇండియా ఉద్యమం 78 వ వార్షికోత్సవానికి పురస్కరించుకొని రాహుల్ శనివారం ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. ‘‘క్విట్ ఇండియా సందర్భంగా ‘డూ ఆర్ డై’ అని మహాత్ముడు పిలుపునిచ్చారు. ఈ నినాదానికి కొత్త అర్థాన్ని ఇద్దాం. ఎలాంటి జంకూ లేకుండా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడదాం’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-08-08T22:03:51+05:30 IST