Greater Noida: పొలంలో మహిళ గడ్డి కోస్తుండగా నలుగురు దుండగులు వచ్చి...ఆమెను అడవిలోకి తీసుకువెళ్లి...

ABN , First Publish Date - 2021-10-11T17:49:35+05:30 IST

గ్రేటర్ నోయిడా అడవుల్లో దారుణం జరిగింది. గ్రేటర్ నోయిడాలో ఓ మహిళ గడ్డి కోస్తుండగా, నలుగురు కీచకులు వచ్చి ఆమెను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి...

Greater Noida: పొలంలో మహిళ గడ్డి కోస్తుండగా నలుగురు దుండగులు వచ్చి...ఆమెను అడవిలోకి తీసుకువెళ్లి...

నోయిడా: గ్రేటర్ నోయిడా అడవుల్లో దారుణం జరిగింది. గ్రేటర్ నోయిడాలో ఓ మహిళ గడ్డి కోస్తుండగా, నలుగురు కీచకులు వచ్చి ఆమెను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి, ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. 55 ఏళ్ల మహిళ గ్రేటర్ నోయిడా ప్రాంత గ్రామంలోని పొలంలో గడ్డి కోస్తుండగా అక్కడే పశువులు కాస్తున్న కాపరి మరో ముగ్గురు దుండగులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి అటవీప్రాంతానికి లాక్కెళ్లాడు.అటవీప్రాంతంలో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. 


అనంతరం నలుగురు నిందితులు పారిపోయారు. బాధిత మహిళ కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైద్య పరీక్ష కోసం బాధిత మహిళను జిల్లా ఆసుపత్రికి పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నోయిడా పోలీసులు చెప్పారు. మహిళపై సామూహిక అత్యాచారం జరిపిన నలుగురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2021-10-11T17:49:35+05:30 IST