England vs India: భారత్కు దీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్.. బెయిర్స్టో సెంచరీ
ABN , First Publish Date - 2022-07-03T23:57:58+05:30 IST
భారత్తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతూ భారత్కు దీటుగా బదులిస్తోంది. 84 పరుగులకే
బర్మింగ్హామ్: భారత్తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతూ భారత్కు దీటుగా బదులిస్తోంది. 84 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును జానీ బెయిర్స్టో ఆదుకున్నాడు. సహచరులతో కలిసి ఆచితూచి ఆడుతున్నాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 119 బంతులు ఎదుర్కొన్న బెయిర్స్టో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ (100) సాధించాడు.
జనవరి 2016 తర్వాత భారత్తో టెస్టుల్లో ఇంత వేగంగా మరే బ్యాటర్ సెంచరీ సాధించలేదు. కాగా, ఈ ఏడాది అద్భుత ఫామ్లో ఉన్న బెయిర్స్టోకు ఇది ఐదో సెంచరీ కావడం గమనార్హం. ప్రస్తుతం అతడికి తోడుగా శామ్ బిల్లింగ్స్ (23) ఉన్నాడు. మరోవైపు, వికెట్ల కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఆరు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసిన ఇంగ్లండ్ భారత్ కంటే 182 పరుగులు వెనక ఉంది.