15శాతం పనులు పూర్తి చేయలేరా?: మాజీ మంత్రి అమర్ ప్రశ్న
ABN , First Publish Date - 2020-10-27T17:15:22+05:30 IST
హంద్రీ-నీవా ప్రాజెక్టు కుప్పం కెనాల్ పనులు 86శాతం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, మిగిలిన 14శాతం పనులు పూర్తి చేయలేక..
పలమనేరు: హంద్రీ-నీవా ప్రాజెక్టు కుప్పం కెనాల్ పనులు 86శాతం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, మిగిలిన 14శాతం పనులు పూర్తి చేయలేక వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాదయాత్రకు హాజరయ్యేం దుకు వెళ్తున్న తనను గృహనిర్భంధం చేయడం దారుణమని పేర్కొన్నారు.పెండింగ్ పనులపై ప్రజలకు అవగాహన కల్పించి వారిద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనుకుంటే అడ్డుకోవలసిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో ఒకప్పటి బీహారు తరహా పాలన ప్రారంభమయిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా వున్న జగన్ పాదయాత్రలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకున్నారా అంటూ ప్రశ్నించారు.