పదిహేను రోజులు... రూ. 1.85 లక్షల కోట్లు వసూలు...

ABN , First Publish Date - 2021-06-18T00:06:14+05:30 IST

ప్రస్తుత(2021-22) ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 1.85 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయి.

పదిహేను రోజులు... రూ. 1.85 లక్షల కోట్లు వసూలు...

న్యూఢిల్లీ : ప్రస్తుత(2021-22) ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 1.85 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయి. ఐటీ మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో వసూళ్ళతో పోలిస్తే ఇది వంద శాతం ఎక్కువ. ఏప్రిల్ ఒకటి నుండి.. ఈ(జూన) నెల 15 వరకు ఈ వసూళ్లు జరిగాయి. ఇందులో... కార్పోరేట్ ఆదాయ పన్ను కింద రూ. 74,356 కోట్లు వసూలు కాగా, వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కింద రూ. 1.11 లక్షల కోట్లు వసూలయ్యాయి. అలాగే రీఫండ్స్ రూ. 30,731 కోట్లుగా నమోదయ్యాయి.


ఇక... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 2.16 లక్షల కోట్లు కాగా, గతేడాది ఇదే కాలంతో పోల్చుకుంటే రూ. 1.37 లక్షల కోట్ల నుండి 57 శాతం పెరిగాయి. ఇందలో కార్పొరేట్ పన్నులు రూ.96,923 కోట్లు. వ్యక్తిగత పన్నుల పరిమాణం రూ.1.19 లక్షల కోట్లు. రిఫండ్స్ తర్వాత నికర వసూళ్లు వరుసగా రూ.74,356 కోట్లు, రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2021-06-18T00:06:14+05:30 IST