ఫిఫా ర్యాంకింగ్స్‌: భారత్‌ స్థానం మెరుగు

ABN , First Publish Date - 2022-06-24T09:15:00+05:30 IST

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు రెండు..

ఫిఫా ర్యాంకింగ్స్‌: భారత్‌ స్థానం మెరుగు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది. ఆసియా కప్‌ అర్హత పోటీల్లో చక్కటి ప్రతిభ ప్రదర్శించిన మన జట్టు 104వ ర్యాంకు దక్కించుకుంది. అయితే ఆసియా స్థాయిలో మాత్రం భారత్‌ 19వ ర్యాంకులోనే కొనసాగుతోంది.


పోరాడి ఓడిన ఫుట్‌బాల్‌ మహిళలు

స్వీడన్‌లో జరుగుతున్న అండర్‌-23 మూడు దేశాల ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా గురువారంనాటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఏకైక గోల్‌తో ఆతిథ్య జట్టు చేతిలో పోరాడి ఓడింది. శనివారం జరిగే తదుపరి పోరులో అమెరికాతో భారత్‌ తలపడనుంది. 


 ఇటలీ చేతిలో చిత్తు

నాలుగు దేశాల టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ జట్టు 0-7 స్కోరుతో ఇటలీ చేతిలో పరాజయం పాలైంది. అక్టోబరులో భారత్‌ ఆతిథ్యమిచ్చే అండర్‌-17 వరల్డ్‌ కప్‌ సన్నాహకాల్లో భాగంగా మన అమ్మాయిలు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారు. 

Updated Date - 2022-06-24T09:15:00+05:30 IST