కంది విత్తనంపై క్షేత్రప్రదర్శన
ABN , First Publish Date - 2022-06-29T05:19:48+05:30 IST
ఇన్ముల్నర్వలో మంగళవారం కంది విత్తనంపై
కొత్తూర్, జూన్ 28: ఇన్ముల్నర్వలో మంగళవారం కంది విత్తనంపై వ్యవసాయాధికారులు రైతులతో క్షేత్రప్రదర్శన నిర్వహించి, ఎస్సీరైతులకు ఉచితంగా విత్తనాలు అందజేశారు. కృషి కేంద్రం రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన కంది విత్తనాలను 33మంది ఎస్సీ రైతులకు అందజేసిన అధికారులు గ్రామ రైతు కోఆర్డినేటర్ ఇంద్రసేనారెడ్డి పొలంలో డెమో ప్రదర్శించారు. మండల వ్యవసాయాధికారి గోపాల్, విస్తరణాధికారి దీపిక, సర్పంచ్ అజయ్మిట్టునాయక్, మండల రైతు కోఆర్డినేటర్ మెండె కృష్ణ, నాయకులు ఎమ్మె సత్యనారాయణ, లింగం, మిట్టునాయక్ పాల్గొన్నారు.