క్షేత్ర సహాయకులే ఉపాధి రథసారథులు
ABN , First Publish Date - 2022-08-17T05:08:51+05:30 IST
క్షేత్ర సహాయకులే ఉపాధి హామీ పథకానికి రథసారథులని డ్వామా పీడీ జీవీ చిట్టిరాజు అన్నారు.
డ్వామా పీడీ చిట్టిరాజు
కలెక్టరేట్, ఆగస్టు 16: క్షేత్ర సహాయకులే ఉపాధి హామీ పథకానికి రథసారథులని డ్వామా పీడీ జీవీ చిట్టిరాజు అన్నారు. మంగళవారం స్థానిక డ్వామా కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పథకం అమలులో ఫీల్డ్ అసిస్టెంట్లే కీలకమని చెప్పారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధి పథకంపై పూర్తి అవగాహనతో ఉండాలని, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలిపారు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచే విధంగా పనులు చేయాలన్నారు. క్షేత్ర సహాయకుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎ.హరిత, డీబీటీ మేజేజర్ విజయవాణి, వివిధ మండలాల ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.