గ్రామాల్లో ఇంటింటా జ్వరాల సర్వే

ABN , First Publish Date - 2021-06-24T04:37:31+05:30 IST

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో జ్వరాలపై సర్వే చేస్తున్నామని వైద్యులు సూర్యకళ తెలిపారు.

గ్రామాల్లో ఇంటింటా జ్వరాల సర్వే
పి.అంకంపాలెంలో ఫీవర్‌ సర్వేలో పాల్గొన్న వైద్యులు, సిబ్బంది

జీలుగుమిల్లి, జూన్‌ 23 : ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో జ్వరాలపై సర్వే చేస్తున్నామని వైద్యులు సూర్యకళ తెలిపారు. పి.అంకంపాలెం లో సచివాలయ సిబ్బందికి వైద్య పరీక్షలు చేశారు. గ్రామంలో సబ్‌ సెంటర్‌ వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేిశారు. ఇంటింటికి తిరిగి ఫీవర్‌ సర్వే చేశారు. పలు రకాల వ్యాధులకు మందులు ఇచ్చారు. హెల్త్‌ సూపర్‌వైజరు ప్రసాద్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ సరోజిని, ఏఎన్‌ఎంలు హెల్త్‌ అసిస్టెంట్‌ ఉన్నారు. 45 సంవత్సరాలు నిండిన వారికి గురువారం పీహెచ్‌సీల వద్ద కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌  వేయనున్నట్లు వైద్యాధికారి కరీమున్నీసాబేగం అన్నారు.

Updated Date - 2021-06-24T04:37:31+05:30 IST