పండుగలు సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక

ABN , First Publish Date - 2022-05-28T06:28:41+05:30 IST

పండుగలు సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని లక్కారంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన దేవాలయంలో శ్రీమల్లికాంబ-మడివాల మాచిదే వుడు, ఈదమ్మల విగ్రహాలను ప్రతిష్ఠించారు.

పండుగలు సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక
పూజల్లో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ చిల్కూరి ప్రభాకర్‌రెడ్డి

చౌటుప్పల్‌ టౌన్‌, మే 27: పండుగలు సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని లక్కారంలో రజక సంఘం ఆధ్వర్యంలో  నిర్మించిన దేవాలయంలో శ్రీమల్లికాంబ-మడివాల మాచిదే వుడు, ఈదమ్మల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా నిర్వహిం చిన పూజల్లో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తానన్నారు. లక్కా రంలో శనివారం నిర్వహించే మాచిదేవుడు- మల్లికాంబల కల్యాణోత్స వానికి రూ.1.50లక్షలను విరాళంగా రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. కార్య క్రమంలో జడ్పీటీసీ చిల్కూరి ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు కొయ్యడ సైదులు, కాసర్ల మంజుల, మాజీ సర్పంచ్‌ కానుగు బాలరాజు, ఉబ్బు వెంకటయ్య, మొగుదాల రమేష్‌, బక్క శ్రీనాథ్‌లు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-28T06:28:41+05:30 IST