ఎరువులు, పురుగుల మందు దుకాణాల తనిఖీ

ABN , First Publish Date - 2022-09-24T05:16:49+05:30 IST

అనంతసాగరం, సెప్టెంబరు 23: మండలంలోని సోమశిల, అనంతసాగరం, పాతదేవరాయపల్లిలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను వ్యవసాధికారులు శుక్రవారం తనిఖీ చేశారు.

ఎరువులు, పురుగుల మందు దుకాణాల తనిఖీ
సోమశిలలో ఎరువుల షాపును తనిఖీ చేస్తున్న ఏడీ బాలాజీనాయక్‌

 అనంతసాగరం, సెప్టెంబరు 23: మండలంలోని సోమశిల, అనంతసాగరం, పాతదేవరాయపల్లిలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను వ్యవసాధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. ఉదయగిరి సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీనాయక్‌ దుకాణాలను సందర్శించి రికార్డులు, అన్‌లైన్‌ వివరాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.4.75 లక్షల విలువ కలిగిన ఎరువులకు సరైన పత్రాలు లేనందున  వాటి అమ్మకాలు నిలుపుదల చేశామని తెలిపారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు రసీదులు ఇవ్వాలని, వాటి వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని దుకాణ యజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాస చక్రవర్తి, విస్తారణాధికారి వెంకటరామయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-24T05:16:49+05:30 IST