పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-04-11T05:01:03+05:30 IST

పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని నరసాపురం పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి డిమాండ్‌ చేశా రు.

పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి

 మౌంజీపాడులో నిరసన

పెంటపాడు, ఏప్రిల్‌ 10 : పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని నరసాపురం పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి డిమాండ్‌ చేశా రు. మౌంజీపాడులో అర్ధ నగ్నంగా ఖాళీ ఎరువు ల సంచులతో శనివారం వినూత్న నిరసన చేశారు. వ్యవసాయ పెట్టుబడులతో ఆర్థిక ఇబ్బందులు పడే రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎరువుల ధరలను 50 శాతం పెంచి మరింత ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తక్షణం ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామంటూ హెచ్చరించారు. కౌలు రైతులు గండికోట అబ్బులు, మేక సత్యనారాయణ, కొడవటి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T05:01:03+05:30 IST