తరగతి గదిలో ఒంటరిగా ఉన్న లేడీ టీచర్.. మరో సీనియర్ టీచర్ రావడంతో లేచి నిలబడింది.. కానీ చివరికి అతడు చేసిన నిర్వాకమిది!

ABN , First Publish Date - 2021-10-11T12:03:30+05:30 IST

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సునీత(పేరు మార్చబడినది) టీచర్‌గా పనిచేస్తోంది. సునీత చాలా అందంగా ఉంటుంది. ఆ స్కూల్‌లో ఆమెతో అందరూ సన్నిహితంగా ఉంటారు. ఒక రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తరగతి గదిలో పిల్లలెవరూ వెళ్లిపోయి ఆమె ఒంటరిగా ఉంది.

తరగతి గదిలో ఒంటరిగా ఉన్న లేడీ టీచర్.. మరో సీనియర్ టీచర్ రావడంతో లేచి నిలబడింది.. కానీ చివరికి అతడు చేసిన నిర్వాకమిది!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సునీత(పేరు మార్చబడినది) టీచర్‌గా పనిచేస్తోంది. సునీత చాలా అందంగా ఉంటుంది. ఆ స్కూల్‌లో ఆమెతో అందరూ సన్నిహితంగా ఉంటారు. ఒక రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తరగతి గదిలో పిల్లలెవరూ వెళ్లిపోయి ఆమె ఒంటరిగా ఉంది. 


ఆ సమయంలో అదే స్కూల్‌లో పనిచేసే మరో సీనియర్ ఉపాధ్యాయుడు పప్పూరాం సునీత ఉన్న తరగతి గదివైపు వచ్చాడు. సునీత ఒంటరిగా కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటోంది. గదిలోకి చప్పుడుచేయకుండా పప్పుపరాం వచ్చి సునీత అందాలను తదేకంగా చూశాడు. ఆమె అందాలని ఆస్వాదించాలని ఆమె దగ్గరకు చేరాడు. సునీత అతడు వచ్చినట్లు గమనించలేదు. 


పప్పురాం మెల్లగా వెళ్లి సునీత చెయ్యి పట్టుకున్నాడు. సునీత ఒక్కసారిగా పప్పురాం ఇలా చేయడంతో ఖంగుతిని అతడిని "ఏం చేస్తున్నావ్?" అని అడిగింది. "అప్పుడు పప్పురాం నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం" అని చెబుతూ సునీతను కౌగిలించుకోబోయాడు. సునీత ఎంత ప్రయత్నించినా.. పప్పురాం నుంచి విడిపించుకోలేకపోయింది. కొంత సమయం తరువాత పప్పురాం బట్టలు విప్పడానికి ప్రయత్నిస్తుండగా.. అదే అదునుగా సునీత అతడిని తోసేసి తరగతి గది నుంచి పారిపోయింది.


మరుసటి రోజు సునీత ఈ విషయం పాఠశాల ప్రిన్సిపాల్(ప్రధాన ఉపాధ్యాయుడు)కు చెప్పింది. పాఠశాలలో మిగతా టీచర్లంతా ఈ విషయం తెలుసుకొని ఖంగుతిన్నారు. కానీ పప్పురాం సీనియర్ స్టాఫ్ అని.. అందువల్ల ఈ విషయంలో మౌనం వహించమని అందరినీ ప్రిన్సిపాల్ ఆదేశించాడు. ఇది తెలిసిన సునీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు పప్పురాంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Updated Date - 2021-10-11T12:03:30+05:30 IST