తుపాకీతో ప్రభుత్వ వైద్యురాలి పోజులు... రంగంలోకి దిగిన పోలీసులు!

ABN , First Publish Date - 2022-09-22T17:22:46+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లా మహిళా ఆరోగ్య వైద్యశాలలో...

తుపాకీతో ప్రభుత్వ వైద్యురాలి పోజులు... రంగంలోకి దిగిన పోలీసులు!

ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లా మహిళా ఆరోగ్య వైద్యశాలలో పనిచేస్తున్న మహిళా వైద్యురాలికి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ఆ మహిళా వైద్యురాలు చేతితో తుపాకీ పట్టుకుని గురిచూస్తూ కనిపిస్తోంది. ఈ ఫొటో వైరల్‌గా మారిన నేపధ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


పోలీసు అధికారి డాక్టర్ కౌస్తుభ్ స్వయంగా రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఈ ఫొటో సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్‌లలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫొటోను తొలుత ఎవరు అప్‌లోడ్ చేశారన్నది ఇంతవరకూ వెల్లడికాలేదు. అయితే ఈ ఫొటో చాలా పాతదనే మాట కూడా వినిపిస్తోంది. ఈ ఉదంతం గురించి పోలీసు అధికారి కౌస్తుభ్ మాట్లాడుతూ దీనిపై విచారణ ప్రారంభించామని, ఆ మహిళా డాక్టర్‌ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-09-22T17:22:46+05:30 IST