ఫీజు రీయింబర్స్‌మెంట్ వైసీపీ పెద్దలకేనా?: అనగాని

ABN , First Publish Date - 2022-03-20T22:05:59+05:30 IST

ఫీజు రీయింబర్స్‌మెంట్ వైసీపీ పెద్దలకేనా?.. పేద విద్యార్థులకు లేదా? అని టీడీపీ నేతలు అనగాని సత్యప్రసాద్

ఫీజు రీయింబర్స్‌మెంట్ వైసీపీ పెద్దలకేనా?: అనగాని

అమరావతి: ఫీజు రీయింబర్స్‌మెంట్ వైసీపీ పెద్దలకేనా?.. పేద విద్యార్థులకు లేదా? అని టీడీపీ నేతలు అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. ఆదివారం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ జగన్‌ విద్యాదీవెనను నిలిపివేస్తూ జీవో 77 తేవడం దుర్మార్గమని తప్పుబట్టారు. జీవో 77తో విద్యార్థులను కూలీలుగా మారుస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థుల ఉన్నత చదువుల కలను చెరిపివేశారని తప్పుబట్టారు. 5.18 లక్షల మంది విద్యార్ధులకు రీయంబర్స్‌మెంట్ దూరం చేసి.. వారి భవిష్యత్ నాశనం చేశారని సత్యప్రసాద్, బాలవీరాంజనేయ మండిపడ్డారు.

Updated Date - 2022-03-20T22:05:59+05:30 IST